ETV Bharat / bharat

పాక్​ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి

author img

By

Published : Jul 18, 2020, 5:08 AM IST

సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్​ తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని గల్పుర్​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్​ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan violated ceasefire
సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్​ తూట్లు

సరిహద్దుల్లో పాకిస్థాన్​ మరోమారు దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా గల్పుర్​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్​ సైన్యం.

ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దాయాది కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారని తెలిపారు పూంచ్​ డిప్యూటి కమిషనర్​ రాహుల్​ యాదవ్​. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇటీవల పాక్​ పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాహుల్​ విమర్శలకు జైశంకర్ ఘాటు జవాబు

సరిహద్దుల్లో పాకిస్థాన్​ మరోమారు దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా గల్పుర్​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్​ సైన్యం.

ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దాయాది కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారని తెలిపారు పూంచ్​ డిప్యూటి కమిషనర్​ రాహుల్​ యాదవ్​. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇటీవల పాక్​ పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాహుల్​ విమర్శలకు జైశంకర్ ఘాటు జవాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.